కంచె ఐలయ్య రాసిన పుస్తకం 'సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్లు' పుస్తకాన్ని నిషేధించలేమని సుప్రీం ధర్మాసనం తెలిపింది. పుస్తకాన్ని నిషేధించడం అంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్లే అని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. ఐలయ్య రాసిన పుస్తకంపై నిషేధం విధించాలని సుప్రీం కోర్టు న్యాయవాది కె ఎల్ ఎన్ వి వీరాంజనేయులు పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం "ఒక వ్యక్తి తన భావాలను వ్యక్తపరచడం ప్రాథమిక హక్కు అని, రచయితకూ తన భావాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుంది" అని పేర్కొని కేసు కొట్టేసింది.
హర్షం వ్యక్తం చేసిన ఐలయ్య..
దీపావళి సందర్భంగా దేశ రాజధానిలో బాణసంచా పేల్చడంపై నిషేధాన్ని ప్రకటించిన సుప్రీంకోర్టు తీర్పుపై ప్రముఖ యోగా శిక్షకులు బాబా రామ్దేవ్ స్పందించారు. ఈ తీర్పు ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు ఉందని విమర్శించారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి తీర్పు ఇవ్వడం, హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, హింద పర్వదినాలపై నిషేదం విధించడం సరైన పద్ధతి కాదన్నారు. అదేవిధంగా ఈ నిషేదం పట్ల సుముఖత వ్యక్తం చేసిన కాంగ్రెసు నాయకుడు శశిథరూర్పై కూడా రామ్దేవ్ విరుచుకుపడ్డారు. థరూర్ లాంటి మేధావులు ఇలాంటి తీర్పులను సమర్థించడం మంచిది కాదన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. నవంబర్ 1 వరకు బాణాసంచా విక్రయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. గతేడాది బాణాసంచా విక్రేతల లైసెన్సులను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఏటా ఢిల్లీలో దీపావళి పండుగ సమయంలో బాణాసంచా కాల్చడంతో కాలుష్యం పెరిగిపోతోందని 2016లో సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. ఈ కేసుపై ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఢిల్లీలో బాణాసంచా విక్రయాలపై ఆంక్షలు విధించింది.
వ్యక్తిగత గోప్యత అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది ప్రాధమిక హక్కుగానే పరిగణించాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. అయితే దీన్ని ఇతర ప్రాధమిక హక్కుల్లా సంపూర్ణమైనదిగా పరిగణించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్ ఖేహర్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.