ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ శ్రీరాముడు అంటే ఫుల్ ఖుషీ అయిన డార్లింగ్ ఫ్యాన్స్.. అతడికి విలన్గా రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ని ( Saif Ali Khan as villain ) మాత్రం ఊహించుకోలేకపోతున్నారు. ప్రభాస్కి విలన్గా సైఫ్ అలీ ఖాన్ని కాకుండా ఇంకెవరినైనా తీసుకోవాల్సిందిగా ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓం రావత్కి ( Om Raut ), ఆ చిత్ర నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు.
డార్లింగ్ ప్రభాస్ మనసు వెన్నలాంటిది అని అతనితో కాస్త సమయం వెచ్చించిన ఎవరికైనా తెలుస్తుంది. నేచర్ లవర్ అయిన ప్రభాస్ తాజాగా తన మనసు చాటుకున్నాడు. ఏకంగా అడవి భూమినే దత్తత తీసుకున్నాడు. హైదరాబాద్ కు సమీపంలో ఉన్న కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో 1,650 ఎకరాల ఆటవీ భూమిని అడాప్ట్ చేసుకున్నాడు.
Prabhas నటించనున్న అప్కమింగ్ సినిమాల్లో ఒకటైన ఆదిపురుష్లో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో ( Saif Ali Khan as Ravan ) విలన్గా కనిపించనున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Prabhas 22వ ప్రాజెక్ట్ ఇదేనంటూ ఆగస్ట్ 18న ఉదయం 7.11 గంటలకు బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ 'ఆదిపురుష్' సినిమాను ( Adipurush movie ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన కొన్ని క్షణాల్లోనే ఒక వైరల్ టాపిక్గా మారిన ఈ ప్యాన్-ఇండియన్ ప్రాజెక్టును టి-సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్ నిర్మించబోతున్నాడు.
అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga ) తన తదుపరి చిత్రాన్ని త్వరలో ప్రకటించబోతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Prabhas ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న రాధే శ్యామ్ సినిమాలో ( Radhe Shyam ) నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే ( Pooja Hegde ) జంటగా నటిస్తోంది. లాక్ డౌన్ సడలింపుల తరువాత సెప్టెంబరు 2వ వారం నుంచి ఈ మూవీ తిరిగి షూటింగ్ని ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా ( Sandeep Vanga ) తన తదుపరి చిత్రాన్ని త్వరలో ప్రకటించబోతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు. తన తదుపరి చిత్రం ఒక క్రైమ్ డ్రామా కథ అని, ఆ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని సందీప్ పేర్కొన్నాడు.
ప్రముఖ నిర్మాత Dil Raju మరో మల్టీస్టారర్ను రూపొందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో ( Prabhas, Allu Arjun multistarrer ) నటించనున్నట్లు సమాచారం. ఈ మల్టీస్టారర్ని ఆర్ఆర్ఆర్ మూవీ ( RRR movie ) కంటే భారీ స్థాయిలో నిర్మించాలని దిల్ రాజు భావిస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది.
తొలుత సీత పాత్ర కోసం మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించిన హీరోయిన్ కీర్తి సురేష్ని ( Keerthy Suresh ) తీసుకోవాలని భావించారని వార్తలొచ్చాయి. ఐతే ఆమెకు ఉత్తరాదిన ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం, ఆదిపురుష్ చిత్రానికి బాలీవుడ్ మార్కెట్ ముఖ్యమైనది కావడంతో ఆమె పేరును పక్కకుపెట్టారనే టాక్ వినిపించింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) బాలీవుడ్లో తన తొలి ప్రాజెక్టును ఇటీవల ప్రకటించాడు. ఆది పురుష్ సినిమాకు ప్రభాస్ను ఎందుకు ఎంపిక చేశాడు, ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని విషయాలు దర్శకుడు ఓం రౌత్ షేర్ (Om Raut open up About Prabha) చేసుకున్నారు.
టాలీవుడ్లో మరో హీరో పెళ్లి త్వరలోనే కానుంది. ఇటీవలనే ప్రముఖ హీరోలు నిఖిల్, నితిన్, రాణా మ్యారెజ్లు అంగరంగవైభవంగా జరిగాయి. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) తమ్ముడు నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఎంగేజ్మెంట్ కూడా వారం క్రితమే జరిగింది. అయితే సోలో బతుకే సో బెటర్ అన్న మెగాస్టార్ మేనల్లుడు, మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
బాహుబలి, సాహో చిత్రంతో జాతీయ స్థాయిలో బ్రాండ్ గా ఎదిగాడు ప్రభాస్. వరుసగా జాతీయ స్థాయి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా టీ సిరిస్ తో ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయాన్ని ప్రకటించాడు. ఈ మూవీ గురించి తన మనసులో మాట చెప్పాడు ప్రభాస్..
బాహుబలి ప్రాజెక్టు తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. బిజీ షెడ్యూల్స్లో ఉంటూనే డైరెక్ట్ బాలీవుడ్ చేస్తున్నట్లు ప్రభాస్ ప్రకటించేశాడు. సినిమా టైటిల్ ‘ఆదిపురుష్’ (Prabhas Next Movie Adipurush) అని తెలిపాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) తన తదుపరి పాన్-ఇండియా చిత్రంపై ఈ రోజు సాయంత్రం ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చాడు. ప్రముఖ బాలీవుడ్ ఫిలింమేకర్, తన్హాజీ దర్శకుడు ఓం రావుత్తో ( Om Raut ) కలిసి తన ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న వీడియోను విడుదల చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.