Kinetic Luna Electric Bike 2024: భారత్ ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్స్కి ఉన్న ప్రత్యేకమైన డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త కంపెనీ ప్రీమియం ఫీచర్స్తో బైక్లను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని మోటర్ సైకిల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వేరియంట్స్లో బైక్లను లాంచ్ చేశాయి. ఇదిలా ఉండగా భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ మోపెడ్ కైనెటిక్ లూనా కూడా తమ కొత్త ఎలక్ట్రిక్ బైక్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. కంపెనీ దీనిని e-Luna అనే పేరుతో కొత్త బైక్ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ బైక్ను మొత్తం రెండు వేరియంట్స్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులోని మొదటి వేరియంట్ ఎలక్ట్రిక్ మోపెడ్ X1 బేస్ బైక్ రూ.69,990 నుంచి ప్రారంభం కాబోతోంది. దీంతో పాటు ఇక రెండవ వేరియంట్ స్పెక్ X2 రూ.74,990తో లభిస్తోంది. ఈ ఇ-లూనా బైక్ మొత్తం ఐదు కలర్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది. ఇది ఎంతో ప్రత్యేకమైన డిజైన్తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఇ-లూనాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక ఈ ఇ-లూనా బైక్ డిజైన్ వివరాల్లోకి వెళితే, ఇది ప్రీమియం లుక్లో ప్రత్యేకమైన థీమ్తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది ముందుగా భాగంలో రౌండ్ షేప్ హెడ్ల్యాంప్ సెటప్ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు కంపెనీ ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ను కూడా అందస్తోంది. అలాగే ఎంత లగేజీనైన సులభంగా క్యారీ చేసేందుకు రిమూవబుల్ రియల్ సీటు కూడా అందిస్తోంది. అలాగే ప్రత్యేకమైన మొబైల్ USB ఛార్జింగ్ పోర్ట్ను కూడా కలిగి ఉంటుంది.
ఈ బైక్ ఇతర ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన e-Luna 1.2kW హబ్-మౌంటెడ్ మోటార్తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 2 kWh బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంటుంది. అలాగే ఈ మోటర్ 22 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు ఇది శక్తివంతమైన పవర్ట్రెయిన్తో లభిస్తోంది. అలాగే ఈ బైక్ను పూర్తిగా ఛార్జ్ చేసేందుకు దాదాపు 4 గంటల కంటే ఎక్కువగా టైమ్ పడుతుంది. ఈ ఇ-లూనా బలమైన వీల్స్తో మార్కెట్లోకి వచ్చింది. ఈ వీల్స్ 16-అంగుళాల వైర్-స్పోక్ను కలిగి ఉంటాయి. దీంతో పాటు రెండు వీల్స్ డ్రమ్ బ్రేక్ల సెటప్తో లభిస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇక ఈ స్మార్ట్ బైక్ వివరాల్లోకి వెళితే..కైనెటిక్ ఇ-లూనా TVS XL100 కంటే చాలా ఖరీదుతో లభిస్తోంది. ఈ బైక్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 110 కిమీ పరిధి మైలేజీని అందిస్తుంది. దీంతో పాటు ఇది గరిష్టంగా 50 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. అంతేకాకుండా ఇది 150 కిలోల వరకు పేలోడ్ను మోసుకెళ్లేలా సమర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. దీని బరువు దాదాపు 96 కేజీలు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇది మార్కెట్లో వివిధ రకాల ఎలక్ట్రిక్ స్కూటీలతో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని ఇప్పుడే బుకింగ్ చేసుకోవాలనుకుంటే రూ.500 చెల్లించి ఈ బ్రాండ్ అధికారిక వెబ్సైట్లో లాగ్ఇన్ అవ్వాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి