KCR Public Meeting Accident: కేఆర్ఎంబీ వివాదంపై బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్లగొండ' సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. బహిరంగ సభ అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు కాగా, ఓ హోంగార్డు మృతి చెందాడు.
KCR Speech In Nalgonda: ఓటమి అనంతరం 'ఛలో నల్లగొండ' బహిరంగ సభతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గర్జించారు. తెలంగాణకు అన్యాయం జరిగినే తన కట్టె కాలే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు.
YS Sharmila Revanth Reddy Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పునఃప్రవేశించిన తర్వాత తొలిసారి మళ్లీ తెలంగాణలో వైఎస్ షర్మిల అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కావడం గమనార్హం.
Harish Rao Assembly Speech: తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులపై చర్చ జరగ్గా అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధమే జరిగింది. హరీశ్ రావు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
Telangana: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. ఈసారి గతానికి కన్నా ఎక్కువ స్థానాలు సాధించడానికి 'పంచ వ్యూహం' రచించింది. రాష్ట్రవ్యాప్తంగా యాత్రల మీద యాత్రలు చేయాలని నిర్ణయించింది.
Bonthu Rammohan: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. కీలక నాయకులంతా పార్టీని వీడుతున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన కీలక నాయకుడు ముఖ్యమంత్రిని కలిశారు.
Raithu Bandhu: రైతు పెట్టుబడులకు భరోసాగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధుపై కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనేపథ్యంలో రైతు పెట్టుబడి రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Telangana Budget: కొత్తగా ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రజలకు ఆరు గ్యారంటీలు దక్కవని చెప్పారు. ప్రజలు వాటిపై ఆశలు పెట్టుకోవద్దని సూచించారు.
Rythu Bharosa: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ యజమానులకు భారీ షాకిచ్చింది. వ్యవసాయం చేయని భూ యజమానులకు పెట్టుబడి సహాయం విషయంలో ఆంక్షలు విధించింది.
Big Shock For BRS: హస్తం గూటికి వలసల పర్వం మొదలైంది. నిన్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక వీళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారా? లేదా? అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈనేపథ్యంలో బోరబండ కార్పొరేటర్, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Patnam Mahender Reddy Meets Revanth Reddy: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేటట్టు పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని కలవడంతో రాజకీయాల్లో కలకలం ఏర్పడింది.
Harish Rao Jangaon Meeting: కృష్ణా జలాల వివాదంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడేక్కగా.. గులాబీ పార్టీ నాయకులు వెనక్కి తగ్గడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్పై, రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
KRMB Issue Telangana KCR: కృష్ణా జలాల అంశంపై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి డ్రామాలకు తెరలేపారని ఒకప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో పని చేసిన జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
Krishna Projects: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కృష్ణా జలాల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లతో తెలంగాణలో జల యుద్ధానికి తెరలేచింది. రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను మాజీ మంత్రి హరీశ్ రావు స్వీకరించి.. అసెంబ్లీలో చూసుకుందామని ప్రతి సవాల్ విసిరారు.
Auto Workers Free Bus: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా మరో అంశంపై కేటీఆర్ కాంగ్రెస్ను నిలదీశారు. అయితే ఈసారి రేవంత్ రెడ్డికి లేఖరూపంలో విజ్ఞప్తి చేయడం విశేషం.
Karimnagar MP Seat: కరీంనగర్ ఎంపీగా సాధించిదేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో సంజయ్ విరుచుకుపడ్డారు. వ్యక్తిగత స్థాయిలో కేటీఆర్ను విమర్శించారు.
Seethakka Vs KTR: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ.. ప్రజాక్షేత్రంలోనూ తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్పై సీతక్క విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్లో కేటీఆర్ పెంచుకునే కుక్కల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు.
Siddipet Thanks Meet: తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన సిద్దిపేట నియోకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కృతజ్ణతలు తెలిపారు. ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే సత్తా చూపి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
KTR meet With Karyakartas: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టిన గులాబీ దళం ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సమావేశానికి వెళ్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.