Chiranjeevi - Padma vibhushan: పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత చిరుకు సీఎం రేవంత్, కోమటి రెడ్డి సహా పలువురి ప్రముఖుల శుభాకాంక్షలు..

Padma Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ పద్మ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులైన వెంకయ్య నాయుడిగారికి,చిరంజీవికి ఒకేసారి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై పలువురు వెంకయ్య నాయుడుగారికి,చిరుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 26, 2024, 03:33 PM IST
Chiranjeevi - Padma vibhushan: పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత చిరుకు సీఎం రేవంత్, కోమటి రెడ్డి సహా పలువురి ప్రముఖుల శుభాకాంక్షలు..

Padma Awards 2024: 2024 యేడాదికి గాను పలు రంగాల్లో ప్రముఖులను పద్మ అవార్డులతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రజా సేవల రంగం నుంచి వెంకయ్య నాయుడికి, సినీ రంగం నుంచి చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు పద్మ విభూషణ్‌కు ఎంపిక కావడంపై బెస్ట్ విషెస్ తెలియజేసారు. అటు తెలుగు రాష్ట్రాల నుంచి
కళా, సాహిత్య రంగాల నుంచి పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాభినందలు తెలియజేసారు.

మచిలీపట్నానికి చెందిన హరికథ కళాకారిణి శ్రీమతి ఉమా మహేశ్వరి, తెలంగాణ రాష్ట్రం నుంచి చిందు యక్ష గాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, స్థపతి  వేలు ఆనందాచారి, బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప. సాహిత్య విభాగం నుంచి కేతావత్ సోంలాల్, కూరెళ్ళ విఠలాచార్య పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడంపై రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.  

అటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేసారు. పునాది రాళ్లు సినిమా నుంచి ప్రారంభమైన చిరు నట ప్రస్థానం రాబయో విశ్వంభర దాక విజయవంతంగా సాగితుంది. వారు నేత్ర దానం, రక్త దానం ద్వారా కోట్లాది ప్రజల గుండెల్లో చిరంజీవిగా చిర స్థాయిగా నిలిచిపోయారన్నారు. చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు వరించిన సందర్బంగా చిరంజీవికి నా తరుపున తెలంగాణ ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు తెలియజేసారు. అటు వెంకయ్య నాయుడుతో పాటు చిరు పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక కావడంపై సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

Also Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News