Private Travel Fire Accident: పల్నాడులో ఘోరం.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీ కొట్టిన టిప్పర్‌.. 6 గురి సజీవదహనం..

Private Travel Fire Accident at Palnadu: పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు, టిప్పర్‌ ఢీ కొనడంతో 6 గురు సజీవదహనమయ్యారు.. ఈ ఘటన మంగళవారం రాత్రి 1.30 ప్రాంతంలో  చిలకలూరిపేట ఈవూరిపాలెం వద్ద జరిగింది.

Written by - Renuka Godugu | Last Updated : May 15, 2024, 07:30 AM IST
Private Travel Fire Accident: పల్నాడులో ఘోరం.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీ కొట్టిన టిప్పర్‌.. 6 గురి సజీవదహనం..

Private Travel Fire Accident at Palnadu: పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు, టిప్పర్‌ ఢీ కొనడంతో 6 గురు సజీవదహనమయ్యారు.. ఈ ఘటన మంగళవారం రాత్రి 1.30 ప్రాంతంలో  చిలకలూరిపేట ఈవూరిపాలెం వద్ద జరిగింది. బస్సులో ఉన్నవారంతా నీలాయిపాలెం వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఆ బస్సులో ఉన్నవారంతా సోమవారం జరిగిన ఎన్నికల నేపథ్యంలో తమ స్వంత ఊళ్లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నవారు. మంగళవారం తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న తిరుగు ప్రయాణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్ల చినగంజాం నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన అరవింద ట్రావెల్‌ బస్సు, చిలకలూరిపేట ఈవూరివారిపాలెం డొంక సమీపంలో కాంక్రీట్‌ లారీ ఢీ కొట్టడంతో బస్సు, టిప్పర్‌ రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్‌లతోపాటు మరో నలుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మిగిలివారందరికీ గాయలు అయ్యాయి. బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరంతా బాపట్ల జిల్లా చిన్నగంజం, నీలాయిపాలెం వాసులుగా గుర్తించారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ఊళ్లకు వచ్చినవారు తిరిగి హైదరబాద్‌ బాట పడుతుంటగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 

ఇదీ చదవండి:  సీఎం వైఎస్‌ జగన్‌కు శుభవార్త.. విదేశీ ప్రయాణానికి సీబీఐ కోర్టు పచ్చజెండా

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఈ ప్రమాదంలో గాయలైనవారిని చిలకలూరిపేట పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను గుంటూరుకు తరలించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఏపీలో 80 శాతం పోలింగ్, ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం

మృతుల వివరాలు ఇలా ఉన్నాయి..
అంజి (35) డ్రైవర్
కాశీ (65) నీలాయిపాలెం
లక్ష్మి (55)నీలాయిపాలెం
ముప్పరాజు సాయిశ్రీ (8) నీలాయిపాలెం, మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News