YSRCP Leaders Leaks: అంబటి, అవంతి, పృధ్వి.. తాజాగా గోరంట్ల.. రాసలీలల లీకులతో వైసీపీ పరువు గోవిందా!

YSRCP Leaders Leaks:  హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సెగలు రేపుతోంది. న్యూడ్ వీడియో కాల్ తో అడ్డంగా దొరికిపోయిన ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై వైసీపీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌నే చ‌ర్చ సాగుతోంది.

Written by - Srisailam | Last Updated : Aug 5, 2022, 12:43 PM IST
  • ఎంపీ గోరంట్ల వీడియో కాల్ కలకలం
  • గతంలో అంబటి, అవంతిపై ఆరోపణలు
  • రాసలీలల లీకులతో వైసీపీ షాక్
YSRCP Leaders Leaks: అంబటి, అవంతి, పృధ్వి.. తాజాగా గోరంట్ల.. రాసలీలల లీకులతో వైసీపీ పరువు గోవిందా!

YSRCP Leaders Leaks: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. లీకైన వీడియోలో  ఓ మహిళతో గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియోకాల్  మాట్లాడారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో  వైరల్ గా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సెగలు రేపుతోంది. గోరంట్ల వీడియో వ్యవహారంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందిస్తుండగా.. అధికార వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. వీడియోపై ఏమి మాట్లాడలేని దుస్థితిలో వైసీపీ నేతలు పడిపోయారు. ఎంపీ గోరంట్ల మాత్రం తనపై టీడీపీ నేతలు కుట్ర చేశారని అంటున్నారు. గోరంట్ల తాజా ఎపిసోడ్ తో గతంలో వైసీపీ నేతలకు సంబంధించి బయటికి వచ్చిన రాసలీలల ఘటనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతంలో మంత్రిగా ఉంటూ అవంతి శ్రీనివాస్ ఓ మహిళతో మాట్లాడిన ఫోన్ కాల్ లీకైంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుకు సంబంధించి చాలా సార్లు ఆడియో కాల్స్ లీకయ్యాయి. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి  పవిత్రమైన ఎస్వీబీసీ చైర్మెన్ హోదా ఉంటూ చేసిన రాసలీలల వ్యవహారం వైసీపీని షేక్ చేసింది.

అంబటి రాంబాబుకు సంబంధించి 2021 ఆగస్టులో ఓ ఆడియో కాల్ బయటికి వచ్చింది. అంబటి రాంబాబు ఓ మహిళతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో  సుకన్య అనే మహిళ గురించి అసభ్యంగా మాట్లాడారు అంబటి రాంబాబు. అయితే వైరల్ అయిన ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని అంబటి రాంబాబు ఓ వీడియో విడుదల చేశారు. తన పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా  కుట్ర జరుగుతోందని చెప్పారు. గతంలోనూ తనపై ఇలాంటే కుట్రలే జరిగాయన్నారు. ఇటీవలే సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత లక్ష్మిపార్వతి.. తన  పొలంలో ప్రభుత్వం తరపున సబ్సిడీ కింద బోర్ వేయించడానికి ప్రయత్నించింది. అయితే ఆమెతో అనుచితంగా మాట్లాడారు అంబటి రాంబాబు. ఆ ఆడియో కూడా లీకై కలకలం రేపింది. అయితే ఆ ఆడియోపై అంబటి  స్పందించలేదు. దీంతో వాయిస్ అయనదేనని అంతా భావించారు.

గతంలోనూ  ప్రజారాజ్యం పార్టీకి చెందిన సంజన అనే మహిళా కార్యకర్తతో హాస్కి వాయిస్ తో అంబటి రాంబాబు మాట్లాడిన ఆడియో లీకై పెను సంచలనమైంది. తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది.  అప్పుడు ఆ మాటలు తనవేనని అంబటి రాంబాబు ఒప్పుకున్నారు. కాని ఉద్దేశపూర్వకంగా అలా చేశారని ఆరోపించారు. గత మార్చిలో  ఏపీ మంత్రి అంబటి రాంబాబు, అయ్యన్నపాత్రుడి మధ్య ట్వీట్ల వార్‌ కొనసాగింది. అంబటి రాంబాబు రాసలీలలు పేరుతో ఆడియోను విడుదల చేశారు అయ్యన్న పాత్రుడు.  అరేయ్ కాంబాబు నీ బూతు పురాణం సిఎం కి చేరిందని… భర్తరఫ్ చేస్తారో అన్ని తెలిసే కదా ఈ బోగ్గాడికి పదవి ఇచ్చాం అనుకుంటారో వాళ్ళ ఇష్టమంటూ సంచలన ట్వీట్‌ చేశారు.

వైసీపీ నేత, నటుడు పృథ్వీ కూడా రాసలీలల వ్యవహారంలో అడ్డంగా బుక్కైపోయాడు. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని కోల్పోయాడు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే పృధ్వీ  ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఓ మహిళను వెనక నుంచి వాటేసుకున్న ఉదంతం బయటికి వచ్చింది. పెను దుమారం రేపింది. వైసీపీ పెద్దలు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎస్వీబీసీ చైర్మెన్ పదవి నుంచి అతన్ని తప్పించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఓ మహిళతో ఫోన్ లో మాట్లాడిన ఆడియో బయటికి వచ్చింది. అరగంట సమయం కావాలంటూ అవంతి చేసిన కామెంట్ వైరల్ అయింది.  మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మంత్రి పదవి నుంచి తప్పించాలనే డిమాండ్ వచ్చింది. అయితే అదంతా ఫేక్ అని తన వాయిస్ తో డబ్బింగ్ చెప్పించారని పోలీసులకు అవంతి శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. కాని తర్వాత ఆ కేసు వ్యవహారం సైలెంట్ అయిపోయింది.

తాజాగా వెలుగుచూసిన గోరంట్ల వ్య‌వ‌హారంతో వైసీపీ ఇర‌కాటంలో ప‌డింది. సొంత ఎంపీ చర్యపై ఎలా స్పందించాలో కూడా తెలియని దిక్కుతోచ‌ని స్థితిలో వైసీపీ ఉంది. పార్లమెంట్ కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వ్య‌క్తి, ఇంత చిల్లరగా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంట‌నే ప్రశ్నలు వైసీపీ నేతల నుంచే వస్తున్నాయి. గతంలో పృధ్వి వ్యవహారం వెలుగులోనికి రాగానే యాక్షన్ తీసుకుంది వైసీపీ సర్కార్. కాని అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు విషయంలోనూ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంబటి రాంబాబుకు మంత్రిగా ప్రమోషన్ వచ్చింది.ఇప్పుడు న్యూడ్ వీడియో కాల్ తో అడ్డంగా దొరికిపోయిన ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై వైసీపీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌నే చ‌ర్చ సాగుతోంది. మాధ‌వ్‌ విషయంలో అవంతి, అంబటి లానే సైలెంట్ గా ఉంటే మాత్రం వైసీపీకి జనాగ్రహం తప్పదనే టాక్ వస్తోంది.

Read also: Hyderabad Police Towers Inauguration: ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News